ఏడాది ప్రారంభంలోనే డబుల్ హిట్లు అందుకుని శుభారంభం పలికింది శృతిహాసన్. ప్రస్తుతం ‘ది ఐ’ అనే ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్లో నటిస్తూ బిజీగా ఉంది తను. ఇంత బిజీలోనూ సమయం చిక్కినప్పుడల్లా అభిమానులతో తన వ్యక్తిగత సోషల్ మీడియా ద్వారా ఇంటరాక్ట్ అవుతూవుంటుంది శృతి. రీసెంట్గా అభిమానులతో ముచ్చటిస్తూ ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ‘ ఎప్పుడూ ఒకేచోట స్థిరంగా ఉంటే జీవితం బోర్గా ఉంటుంది.
మనిషి ఎప్పటికప్పుడు రీచార్జ్ అవుతూ వుండాలి. అందుకే బోర్ కొడితే బ్రేక్ తీసేసుకుని కొత్త ప్రదేశంలో వాలిపోతుంటా. అలా చేయడం వల్ల నాలో కొత్త ఉత్సాహం వచ్చి చేరుతుంది. పైగా ఒంటరి ప్రయాణంలో ఉన్న కిక్కు మామూలుగా ఉండదు. మనతో మనం మాట్లాడుకునే అవకాశాన్ని ఒంటరి ప్రయాణం ఇస్తుంది’ అంటూ తన మనసుని ఆవిష్కరించింది శృతి.