ఇంటికి దూరంగా ఉండటం కష్టమే అంటున్నది అందాల తార శృతి హాసన్. ఆమె నటిస్తున్న ఇంటర్నేషనల్ మూవీ ‘ది ఐ’ షూటింగ్ ప్రస్తుతం గ్రీస్లో జరుగుతున్నది. ఈ షూటింగ్ కోసం అక్కడికి వెళ్లిన శృతి హోమ్ సిక్ ఫీలింగ్ను వెల్లడించింది. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో దర్శకుడు డాఫ్నే ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఈ సందర్భంగా శృతి మాట్లాడుతూ…‘నా కెరీర్లో లభించిన అరుదైన అవకాశం ఈ సినిమా. మంచి చిత్రంలో నటిస్తున్నాననే సంతోషం ఒకవైపు.. ఇంటిని, నా వాళ్లను మిస్ అవుతున్నాననే బాధా కలుగుతున్నాయి. శంతను, అతను వేసిన పెయింటింగ్స్, నా పెట్స్ను చూడలేకపోతున్నా. నేను ప్రేమించే కళారంగంలో లభిస్తున్న అవకాశాల పట్ల సంతృప్తిగా ఉన్నాను. గొప్ప వాళ్లతో కలిసి పనిచేస్తున్నాను. నా జీవితంలో సంతోషం, ప్రేమకు కొదవలేదు’ అని చెప్పింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ 107వ సినిమాలో నాయికగా నటిస్తున్నది.