Shruti Hassan |యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కూతురుగా సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన శృతి హాసన్కి తొలి రోజుల్లో ఎన్నో ఒడిదొడుకులు ఎదురయ్యాయి. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా మూడు ఇండస్ట్రీలోనూ నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. కానీ కెరీర్ ఆరంభంలో వరుసగా ఫ్లాప్ సినిమాల వల్ల ఆమెను “ఐరన్ లెగ్” అని పిలిచారు. అయితే పవన్ కళ్యాణ్తో చేసిన ‘గబ్బర్ సింగ్’ ఆమె కెరీర్కు టర్నింగ్ పాయింట్గా నిలిచింది. అప్పటి నుంచి శృతి వెనక్కి తిరిగి చూడలేదు. ఇప్పుడామె పాన్ ఇండియా లెవల్లో సినిమాలు చేస్తోంది. అన్ని భాషల్లోనూ ఆఫర్లు అందుకుంటూ అభిమానులను సొంతం చేసుకుంది. అయితే శృతి సినిమాల ఎంపిక విషయంలో సోషల్ మీడియాలో తరచూ విమర్శలు ఎదుర్కొంటుంది. కొన్ని సినిమాల్లో కేవలం ఐటెం సాంగ్కి లేదా చిన్న పాత్రలకే పరిమితమైందని కామెంట్స్ వచ్చాయి.
తాజాగా వచ్చిన ‘కూలీ’ సినిమాలోనూ ఆమె పాత్రపై విమర్శలు వచ్చాయి. మోనికా పాటలో పూజా హెగ్డేకు ఉన్న గుర్తింపు స్థాయిలో కూడా శృతికి ప్రాధాన్యం లేదని నెటిజన్లు విమర్శించారు. ఈ కామెంట్స్కు శృతి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది. సోషల్ మీడియాలో మూడు ఫోటోలు షేర్ చేసింది. మొదటిది దోశ ఫోటోతో “దోశ = లైఫ్” అంటూ పోస్ట్ చేయడం ద్వారా తనకు సింపుల్ థింగ్స్లోనే హ్యాపీనెస్ దొరుకుతుందని తెలిపింది. రెండోది మేకప్ రూంలో వర్కింగ్ మూడ్ ఫోటో. ఇది షేర్ చేస్తూ “వర్క్ మోడ్ ఆన్!” అంటూ ట్రోల్స్పై పరోక్షంగా గుద్దింది. చివరిది జిమ్లో వర్కౌట్ చేస్తూ ఉన్న ఫోటో, “లైఫ్ ఈజ్ గుడ్” అని చెబుతూ తాను ట్రోల్స్కి పట్టించుకోనని స్పష్టం చేసింది.
ప్రస్తుతం శృతి హాసన్ చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. ‘సలార్ 2’ లో ఆమె పాత్ర కీలకంగా ఉంటుందని సమాచారం. అలాగే విజయ్ సేతుపతితో ఓ కొత్త సినిమా, ఇంకా రెండు ప్రాజెక్టులు వచ్చే ఏడాదిలో విడుదలకు సిద్ధమవుతున్నాయి.