అగ్ర కథానాయిక శృతిహాసన్ కేవలం నటనకు మాత్రమే పరిమితం కాకుండా గాయనిగా కూడా రాణిస్తున్నది. పలు ప్రైవేట్ ఆల్బమ్స్లో ఈ భామ పాటలు పాడిన విషయం తెలిసిందే. నటనతో పాటు గానం, గీత రచన తనకు ఇష్టమైన వ్యాపకాలని చెప్పింది శృతిహాసన్. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు పాటల గురించి అస్సలు మాట్లాడేదాన్ని కాదు. అలా చేస్తే సినిమాలకు దూరం అవుతానేమో అనిపించేది. అయితే కొన్నేళ్లు గడచిన తర్వాత నటనతో పాటు పాటలకు కూడా సమ ప్రాధాన్యతనిచ్చాను.
కోవిడ్ లాక్డౌన్ సమయంలో గాయనిగా నా ప్రతిభకు మరింతగా మెరుగులు దిద్దుకున్నా. గీతాన్ని ఆలపించడంతో పాటు రచన చేయడం నాకు దేవుడిచ్చిన గొప్ప బహుమతి అనుకుంటున్నా. నాలోని భావాల్ని ప్రపంచానికి తెలియపరచడానికి పాట ఓ చక్కటి సాధనంగా ఉపయోగపడుతుంది’ అని చెప్పింది. ప్రస్తుతం ఈ భామ ప్రభాస్ సరసన ‘సలార్’ చిత్రంలో నటిస్తున్నది.