టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రియ ఇటీవలి కాలంలో తన భర్త ఆండ్రూ కోశ్చీవ్ తో కలిసి తెగ సందడి చేస్తుంది. పబ్లిక్ పార్కుల్లో, విహారయాత్రల్లో రచ్చ చేసిన శ్రియ జంట తాజాగా జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ వేదికపై కూడా లిప్లాక్లతో రచ్చ చేశారు. ఏమాత్రం అవకాశం దొరికినా లిప్ లాక్ లు కౌగిలింతలతో హీటెక్కిస్తున్న శ్రియ-కొశ్చీవ్ ఇప్పుడు అవార్డ్ వేడులోను అలా చేయడాన్ని కొందరు తప్పుబడుతున్నారు.
వేదిక ఎక్కగానే ఆండ్రూ ఎంత డీసెంట్ గా ఉండగా, శ్రీయ అంత చిలిపిగా రెచ్చిపోయింది. పబ్లిక్ ప్లేస్ కనిపిస్తే చాలు శ్రీయ ఇలా రెచ్చిపోవడంపైనా ఇప్పుడు మరోసారి వేడిగా చర్చ సాగుతోంది. కాగా, ఇటీవల ముంబైకి వచ్చిన శ్రియ ప్రస్తుతం సినిమాలపై దృష్టి సారించినట్టు తెలుస్తుంది. గత ఏడాది రాధ అనే పాపకు శ్రియ జన్మనివ్వగా, ఈ విషయాన్ని రీసెంట్గా ప్రకటించింది.
శ్రియ తన బిడ్డకు స్పెయిన్ -బార్సిలోనాలో జన్మనిచ్చింది. రాధ నా బెస్ట్ ఫ్రెండ్ ..నా ప్రపంచం“ అంటూ శ్రీయ ఎమోషనల్ అయ్యింది. నా కుమార్తె ఎదుగుతోంది. ఇక దాచలేనని శ్రియ చెప్పింది. రాధతో ప్రతిచోటికి వెళ్లాల్సి వస్తోందని తన వెంటే ఉండాల్సొస్తోందని శ్రియ తెలిపింది. 2018 లో శ్రియ ఆండ్రూని వివాహం చేసుకుంది. ఆండ్రూ యూరప్ లో పెద్ద బిజినెస్ మేన్ అన్న సంగతి తెలిసిందే.