జెర్సీ (Jersey)సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నార్త్ భామ శ్రద్దాశ్రీనాథ్ (Shraddha Srinath). ఈ చిత్రంలో నాని సతీమణి పాత్రలో జీవించేసి మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత స్టార్ హీరో మాధవన్ తో మారా చిత్రంలో నటించింది. ప్రస్తుతం ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది శ్రద్దాశ్రీనాథ్. ప్రపంచం పూర్తిగా నాశనం అవుతుందని జోస్యం చెప్పే కథలో లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ ఫీ మేల్ సెంట్రిక్ మూవీకి కలియుగం (Kaliyugam) టైటిల్ను ఫిక్స్ చేశారు.
డెబ్యూట్ డైరెక్టర్ ప్రమోద్ సుందర్ (Pramodh Sundar) తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఫైనల్ షూటింగ్ సోమవారం మొదలైంది. దీనికి సంబంధించిన స్టిల్ ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. శ్రద్దాశ్రీనాథ్, కిశోర్పై వచ్చే కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ మూవీని ప్రైమ్ సినిమాస్ బ్యానర్పై కేఎస్ రామకృష్ణ నిర్మిస్తున్నారు. త్వరలోనే చిత్రీకరణ పూర్తి చేసుకుని 2022లో థియేటర్లలో సందడి చేయబోతుంది.
ఈ తరహా కథాంశంతో వస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఈ ప్రయోగాత్మక చిత్రం శ్రీద్దాశ్రీనాథ్ ఏ రేంజ్లో క్రేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి.