తెలుగు చిత్ర పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు సోమవారం హైదరాబాద్ తెలుగు ఫిలింఛాంబర్లోని నాలుగు సెక్టార్స్ ప్రముఖులు భేటీ అయ్యారు. ఫిలింఛాంబర్ అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో నిర్మాతలు సి కళ్యాణ్, దిల్ రాజు, సునీల్ నారంగ్, సుప్రియా, స్రవంతి రవికిషోర్, ఏఎం రత్నం తదితరులు పాల్గొన్నారు.
థియేటర్ టికెట్ ధరలు, ఓటీటీలో సినిమాల విడుదలకు పరిమితి, స్టార్స్ పారితోషికాలు, సినీ కార్మికుల వేతనాలు, డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్ల రేట్లు వంటి పలు అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. భేటీ అనంతరం నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ…‘ఫిలింఛాంబర్లోని నాలుగు సెక్టార్స్ వాళ్లంతా కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేశాం.
ఆ కమిటీ ఎల్లుండి జరిగే సమావేశంలో ప్రతి అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. మా మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. షూటింగ్స్ బంద్పై నిర్ణయం తీసుకోలేదు. యధావిధిగా షూటింగ్స్ జరుగుతాయి’ అన్నారు.