Vijay Devarakonda Liger Movie | ఇండస్ట్రీలో ఎన్ని ఫ్లాపులు ఇచ్చిన పర్లేదు కానీ ఒక్క హిట్తో మళ్లీ అన్నీ సర్దుకుంటాయి. ఇప్పుడు పూరి జగన్నాథ్ విషయంలో ఇదే జరుగుతుంది. మూడేళ్ల కింద ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫామ్లోకి వచ్చిన పూరీ.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆగస్టు 25న ఈ సినిమా విడుదల కానుంది. దీని కోసం పెట్టిన బడ్జెట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అలాగే జరుగుతున్న బిజినెస్ అందరి కళ్ళు బైర్లు కమ్మేలా చేస్తుంది. విజయ్ గత సినిమాల కంటే మూడింతలు బిజినెస్ చేస్తుంది లైగర్. విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి 25 కోట్లు.. గీత గోవిందం 60 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత టాక్సీవాలా కూడా దాదాపు 20 కోట్ల వరకు వసూలు చేసింది.
అలా ఉన్నట్లుండి విజయ్ దేవరకొండ మార్కెట్ పెరిగిపోయింది. కానీ కొన్నేళ్లుగా ఈయన సినిమాలు వరసగా ఫ్లాప్ అవుతున్నాయి. టాక్సీవాలా తర్వాత డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు నిరాశ పరిచాయి. అలాంటి సమయంలో పూరీ జగన్నాథ్ లాంటి మాస్ డైరెక్టర్ ఈయనతో లైగర్ సినిమా చేస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా వస్తుంది. ఇందులో విజయ్ దేవరకొండ బాక్సర్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ కు అభిమానులు చేసిన హంగామా చూసి నిజంగానే అందరికీ పిచ్చెక్కిపోతుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు లైగర్ ప్రీ రిలీజ్ బిజినెస్ అన్ని ఇండస్ట్రీలలో కలిపి ఏకంగా 150 కోట్ల వరకు జరుగుతుందని తెలిసి అంతా షాక్ అవుతున్నారు. ఈ సినిమాను పూరీ జగన్నాథ్, ఛార్మి, కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండపై 150 కోట్ల బిజినెస్ జరగడం అనేది చిన్న విషయం కాదు. విజయ్ దేవరకొండ మార్కెట్ బట్టి చూసినా.. ఈయన ట్రాక్ రికార్డు బట్టి చూసినా కూడా ఇది చాలా ఎక్కువ. ఇండియన్ సినిమాల్లో చూడనటువంటి బాక్సింగ్ దృశ్యాలు ఇందులో కనిపించబోతున్నాయి. ఈ సన్నివేశాలే సినిమాకు మేజర్ హైలెట్ కాబోతున్నాయి. ఈ సినిమాలో విజయ్ తండ్రిగా, మాఫియా డాన్గా సునీల్ శెట్టి నటిస్తున్నాడు. విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే నటిస్తుంది. నైజాంలో ఈ సినిమా హక్కులు 40 కోట్లకు అమ్ముడయ్యాయనే వార్త ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. అలాగే రాయలసీమ ఏరియా కూడా రూ.15 కోట్లకు అమ్ముడయినట్లు తెలుస్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 70 కోట్లకు పైగా బిజినెస్ చేస్తోంది ఈ సినిమా. మొత్తానికి చూడాలిక లైగర్ తో విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ కుంభస్థలాన్ని కొడతాడో లేదో.