Guntur Kaaram | టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబోలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం గుంటూరు కారం (Guntur kaaram). ఎస్ఎస్ఎంబీ 28గా వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాలోని ‘కుర్చీ మడతపెట్టి’ పాట ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహేశ్బాబు, శ్రీలీల ఊరమాస్ స్టెప్పులతో థియేటర్లలో మోత మొగించింది ఈ పాట. అయితే ఈ పాటకు తాజాగా కోలీవుడ్ నటుడు డ్యాన్స్ చేశారు.
కోలీవుడ్లో రీసెంట్గా ఓ సినీ వేడుక జరుగగా.. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన తమిళ స్టార్ నటుడు శివ కార్తికేయన్ ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్కు.. తనతో డ్యాన్స్ చేయమని వేదికపై ఉన్న శ్రీలీల కోరగా.. శివ కార్తికేయన్ ఈ పాటకు స్టెప్పులేశాడు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#KurchiMadathaPetti song reach 🙏🏽 🔥
— VA 💙 (@yourstrulyvinay) March 23, 2024
కుర్చీ తాత సరదాకి ‘కుర్చీ మడతపెట్టి’ అనే డైలాగ్ చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ఈ డైలాగ్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యింది. ఇక ఈ డైలాగ్ను హుకప్ లైన్ గా తీసుకుని రామజోగయ్య శాస్త్రి గుంటూరు కారంలో ఏకంగా ఒక పాటనే రాశాడు.