తొంభైల్లో సాగరకన్యగా ప్రేక్షకులను అలరించిన శిల్పాశెట్టి కెరీర్కు కామా పెట్టినా… అడపాదడపా లైమ్లైట్లో
కనిపిస్తూనే ఉంటుంది. బాలీవుడ్లో తనకంటూ ఇమేజ్ను సొంతం చేసుకున్న ఈ పొడుగుకాళ్ల సుందరి ఇప్పుడు
‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ వెబ్సిరీస్తో ఓటీటీ ప్రేక్షకులను పలకరించింది. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్సిరీస్పై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతున్నా.. శిల్ప ఆగమనంపై మాత్రం ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత శిల్ప పంచుకున్న కబుర్లు ఆమె మాటల్లోనే..
సినిమా ఇండస్ట్రీ నేను కోరుకున్నదానికన్నా చాలా ఎక్కువ ఇచ్చింది. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే అందుకు కారణం సినిమా పరిశ్రమే! ఇప్పటికీ ఎక్కడికి వెళ్లినా అభిమానులు ఎంతగానో ఆదరిస్తుంటారు. నటులకు ఇంతకన్నా అదృష్టం ఏముంటుంది? మా పిల్లలు వియాన్, సమీషాకు ఇవేం తెలియకుండా పెంచాలని అనుకోవడం లేదు. వాళ్లు పెద్దయ్యాక ఒకవేళ సినిమాల్లోకి రావాలని అనుకుంటే.. నేను అడ్డు చెప్పను. పైగా, ప్రోత్సహిస్తాను. అలాగని వాళ్లకు నచ్చకపోతే.. సినిమాల్లో పనిచేయాలని ఒత్తిడి చేయను.
నటిగా ఎంత సంతృప్తి పొందానో.. అమ్మగా అంతకు రెట్టింపు ఆనందాన్ని అనుభవిస్తున్నాను. తల్లిగా నా బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తున్నాననే భావిస్తున్నాను. మా అమ్మానాన్న నాకు ఎంత ప్రేమ పంచారో.. నా పిల్లలకు అంత ఇవ్వాలని అనుకుంటూ ఉంటాను. నేను, మా ఆయన రాజ్.. ఇద్దరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నేపథ్యం ఉన్నవాళ్లమే! డబ్బు విలువ మాకు బాగా తెలుసు. అందుకే, ఇప్పుడు ఎంత సంపద ఉన్నా.. వాళ్లను గొప్పింటి బిడ్డల్లా గారాబంగా పెంచాలనుకోవడం లేదు. మిడిల్క్లాస్ వ్యాల్యూస్ తెలిసేలా జాగ్రత్తగా పేరెంటింగ్ చేస్తున్నాం. ఈ విషయంలో మా ఇద్దరి మాటా ఒకటే!