కేంద్ర సెన్సార్ బోర్డ్ నూతన చైర్మన్గా శశిశేఖర్ వెంపటి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. శశి శేఖర్ వెంపటి గతంలో ప్రసార భారతి సీఈఓగా పనిచేశారు. దీనితో పాటు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, టెలివిజన్ రేటింగ్స్ అందించే ‘బార్క్’ ఏజేన్సీ, సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్స్లో శశిశేఖర్ వెంపటి విశేషమైన సేవలందించారు.
ఇటీవలకాలంలో సీబీఎఫ్సీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) వరుస వివాదాలతో సతమతమవుతున్నది. దళపతి విజయ్ తాజా చిత్రం ‘జన నాయగన్’ సెన్సార్ విషయంలో బోర్డ్ అనుసరించిన విధానంపై విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో కొత్త చైర్మన్గా శశిశేఖర్ వెంపటి నియమితులు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.