యువ హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజా చిత్రం ‘మనమే’ త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఇటీవలే బర్త్డే సందర్భంగా శర్వానంద్ నటించబోతున్న రెండు కొత్త చిత్రాలను ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం శర్వానంద్ మరో సినిమాకు కూడా గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.
వివరాల్లోకి వెళితే…‘ఘాజీ’ ‘అంతరిక్షం 9000’ వంటి చిత్రాలతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా గుర్తింపును తెచ్చుకున్నాడు దర్శకుడు సంకల్ప్రెడ్డి. త్వరలో కొత్త చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే శర్వానంద్కు కథ వినపించగా ఆయన ఓకే చేశారని సమాచారం. తొలి రెండు చిత్రాల తరహాలోనే వినూత్నమైన కథాంశంతో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాకు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందని అంటున్నారు.