హీరో శర్వానంద్ బ్యాచిలర్ లైఫ్కు గుడ్బై చెబుతూ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన మనసు మెచ్చిన నెచ్చెలి రక్షితా రెడ్డితో కలిసి ఆయన ఏడడుగులు వేయనున్నారు. ఈ జంట నిశ్చితార్థం గురువారం హైదరాబాద్లోని ఓ హోటల్లో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు తెలుగు చిత్రసీమలోని పలువురు ప్రముఖులు విచ్చేసి కొత్త జంటకు శుభాకాంక్షలందజేశారు. ఇండస్ట్రీలో శర్వానంద్ బెస్ట్ఫ్రెండ్ అయిన రామ్చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి నిశ్చితార్థ వేడుకలో సందడి చేశారు. రక్షితా రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నది. ఆమె తండ్రి పసునూర్ మధుసూదన్ రెడ్డి హై కోర్టు లాయర్గా ఉన్నారు. గత ఏడాది ‘ఒకే ఒక జీవితం’ చిత్రంతో శర్వానంద్ ప్రేక్షకుల్ని పలకరించిన విషయం తెలిసిందే.