బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్..జీరో సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే అట్లీ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. నయనతార, ప్రియమణి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో షారుఖ్ ఈ క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్ను నిర్మిస్తున్నారు
షారూఖ్- అట్లీ సినిమా తొలి షెడ్యూల్ పూణేలో చేశారు. ఇందులో షారూఖ్ సరికొత్తగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి “లయన్” అనే టైటిల్ పెట్టారనే ఊహాగానాలు వస్తున్నాయి. పూణేలోని సంత్ తుకారామ్ నగర్ మెట్రో స్టేషన్లో చిత్రీకరణకు అనుమతి కోరుతూ చిత్ర నిర్మాణ బృందం రాసిన లేఖలో ఈ చిత్రానికి “లయన్” అనే పేరు పెట్టారని పేర్కొన్నారు. ఆ లెటర్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. బాలకృష్ణ హీరోగా వచ్చిన లయన్ చిత్రం సత్యదేవ్ దర్శకత్వంలో తెరకెక్కగా, ఇందులో త్రిష,రాధికా అప్టే కథానాయికలుగా నటించారు.