Sharukh -Salman | బాలీవుడ్లో స్టార్ హీరోలంటే మనకు ముందుగా గుర్తొచ్చే పేర్లు షారుక్ ఖాన్ (Shah Rukh Khan), సల్మాన్ఖాన్ (Salman Khan). వీళ్లిద్దరి సినిమాలు విడుదలవుతున్నాయంటే చాలు థియేటర్ల వద్ద అభిమానులు సందడి మామూలుగా వుండదు. ఇక రీసెంట్గా వీరిద్దరూ షారుక్ పఠాన్ సినిమాలో కనిపించి సందడి చేశారు. అఫ్ స్క్రీన్ లో కూడా వీరి మధ్య మంచి అనుబంధం వుంది. ఈ ఇద్దరు స్టార్స్ ఎప్పుడు కలిసిన అది నేషనల్ వైడ్ వార్త అవుతుంది. ఇదిలా ఉంటే ఈ ఇద్దరూ మరోసారి కలసి సందడి చేశారు.
మహారాష్ట్రలో ప్రతి ఏడాది గణేష్ చతుర్థి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతాయి. అయితే ఈ ఉత్సవాల సందర్భంగా ఆదివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (Ek Nath Shinde) ఇంట్లో గణపతి పూజ నిర్వహించారు. ఇక ఈ పూజలో పాల్గొనేందుకు బాలీవుడ్ సూపర్ స్టార్లు షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, హాజరయ్యారు. పూజా అనంతరం షారూఖ్, సల్మాన్ ఇద్దరూ సీఎం ఏక్నాథ్ షిండేతో కలిసి ఫొటోలకు పోజులిచ్చి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Both Shahrukh Khan and Salman Khan kept hands but Eknath Shinde asks SRK to remove his hand 🖐️ pic.twitter.com/KrUIzkS4uV
Mission Raniganj Trailer Today— AP (@AksP009) September 25, 2023
📸Megastar Salman Khan & Baadshah Shah Rukh Khan pic.twitter.com/xZB6Ywb85E
— Manobala Vijayabalan (@ManobalaV) September 24, 2023
ఇక ఈ వేడుకల్లో పూజా హెగ్డే , జాకీ ష్రాఫ్, అర్జున్ రాంపాల్, సునీల్ శెట్టి, పంకజ్ త్రిపాఠి, అర్పితా ఖాన్ శర్మ, ఆయుష్ శర్మ టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్, పూజా దద్లానీ లాంటి బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.
ఇదిలా ఉండగా.. ఇటీవలే షారుక్ ఖాన్ నటించిన ‘జవాన్’ సినిమా విడుదలైన వారం రోజుల్లోనే వరల్డ్ వైడ్గా రూ.650 కోట్లు కొల్లగొట్టి.. తాజాగా రూ.1000 కోట్ల క్లబ్లో చేరింది. మరోవైపు సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ దీపావళి విడుదలకు సిద్ధమౌతోంది. ఇక ఈ ఇద్దరు స్టార్స్ కలిసి నటించబోతున్న ‘టైగర్ వెర్సస్ పఠాన్’ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో వుంది.