షర్మాన్ జోషి, శ్రియా సరన్ జంటగా నటిస్తున్న సినిమా ‘మ్యూజిక్ స్కూల్’. యామినీ ఫిల్మ్స్ నిర్మాణంలో దర్శకుడు పాపారావు బియ్యాల రూపొందిస్తున్నారు. ఇళయారాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర మూడో షెడ్యూల్ తాజాగా పూర్తయింది. హిందీ, తెలుగు భాషల్లో ఈ సినిమా నిర్మితమవుతున్నది. ఈ సందర్భంగా నాయిక శ్రియా సరన్ మాట్లాడుతూ…‘45 రోజుల పాటు జరిగిన భారీ షెడ్యూల్ పూర్తి చేశాం. సినిమాలో మొత్తం 11 పాటలు ఉండగా..10 పాటల చిత్రీకరణ జరిగింది. పర్మాన్ జోషితో నటించడం సంతోషంగా ఉంది. పిల్లలతో షూటింగ్లో పాల్గొనడం ఆహ్లాదంగా అనిపిస్తున్నది’ అని చెప్పింది. 80 శాతం చిత్రీకరణ పూర్తి చేశామని, మ్యూజికల్ ఫిల్మ్ గా గుర్తుండిపోయేలా రూపొందిస్తున్నామని దర్శకుడు పాపారావు బియ్యాల తెలిపారు. సుహాసినీ మూలే, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : కిరణ్ డియోహాన్స్.