Krithishetty | యువ హీరో శర్వానంద్ను ప్రస్తుతం ఫ్లాప్లు వెంటబడుతున్నాయి. ఈయన నటించిన గత ఐదు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ పరాజయాలను మూటగట్టుకున్నాయి. ఈసారి ఎలాగైనా తిరిగి హిట్ ట్రాక్లోకి రావాలని సక్సెస్ఫుల్ దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించిన ‘ఆడవాళ్లు మీకు జోహర్లు’ చిత్రంలో నటించాడు. రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలై పాజీటీవ్ టాక్ను తెచ్చుకుంది. కానీ కలెక్షన్లలో మాత్రం ఈ చిత్రం జోరు చూపించలేకపోతుంది. 16.5 కోట్ల బ్రేక్ ఈవెన్తో బరిలోకి దిగిన ఈ చిత్రం ఇప్పటివరకు కేవలం 5.67 కలెక్షన్లను మాత్రమే సాధించింది. వచ్చే వారం ‘రాధేశ్యామ్’ విడుదల కానుంది. ఈలోపే ఈ చిత్రం మరో 11.5 కోట్ల వరకు షేర్ను సాధించాల్సి ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే శర్వానంద్ నెక్స్ట్ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
శర్వానంద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై ఓ చిత్రం చేయనున్నాడు. ‘ఛల్ మోహన్రంగ’ ఫేం కృష్ణ చైతన్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్గా ఉప్పెన బ్యూటి కృతిశెట్టిని ఎంపిక చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే మేకర్స్ కృతిశెట్టితో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. అయితే కృతిశెట్టి మాత్రం ఈ ప్రాజెక్ట్కు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టాక్. ప్రస్తుతం ఈమె ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘ది వారియర్’, ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాలలో హీరోయిన్గా నటిస్తుంది. ఇక శర్వానంద్ ప్రస్తుతం ‘ఓకే ఒక జీవితం’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీ కార్తిక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో అక్కినేని అమల కీలకపాత్రలో నటిస్తుంది.