Sharathulu Varthisthai! | కీడా కోలా ఫేమ్ టాలీవుడ్ యువ నటుడు చైతన్య రావు, భూమి శెట్టి ప్రధానపాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’. ఈ సినిమాకు కుమార స్వామి (అక్షర) దర్శకత్వం వహిస్తుండగా.. స్టార్ లైట్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై శ్రీలత, నాగార్జున సామల, శ్రద్ద, శ్రీకుమార్ గుండా తదితరులు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలంగాణ బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ సినిమా మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ వేగం పెంచారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్తో పాటు ‘పన్నెండు గుంజాల’ సాంగ్, టీజర్ విడుదల చేయగా.. ప్రేక్షకుల వద్ద నుంచి మంచి ఆదరణ లభించింది.
ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ దేశంలో ఉన్న ఎనభై శాతం సామాన్యుల కథనే మన ఈ సినిమా అన్న డైలాగ్తో ట్రైలర్ మొదలవుతుంది.. కరీంనగర్ జిల్లాలో ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన చిరంజీవి (చైతన్య రావు) తల్లి, తమ్ముడు, చెల్లి బాధ్యతలను భుజానికి ఎత్తుకొని బ్రతుకుతుంటాడు. అయితే అదే ప్రాంతానికి చెందిన విజయశాంతితో చిరంజీవికి పెళ్లి అవుతుంది. ఈ క్రమంలోనే అనుకోకుండా చిరంజీవి ఒక బిజినెస్లో మోసపోతాడు. అయితే చిరంజీవి మోసపోయిన బిజినెస్ ఏంటి. ఈ ప్రమాదం నుంచి చిరంజీవి ఫ్యామిలీ ఎలా బయటపడింది అనే కథాంశంతో ఈ సినిమా వస్తుంది. దిగువ మధ్యతరగతి కుటుంబ జీవితాల ఆధారంగా వచ్చి.. ఫుల్ ఎమోషనల్గా సాగిన ఈ ట్రైలర్ ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.