విజయనిర్మల మనవడు శరణ్కుమార్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘మిస్టర్ కింగ్’. శశిధర్ చావలి దర్శకత్వం వహిస్తున్నారు. బి.ఎన్.రావు నిర్మాత. శనివారం ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఓ విభిన్నమైన కథ ఇది. నేటి యూత్కు బాగా కనెక్ట్ అవుతుంది. లాక్డౌన్ టైమ్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని చిత్రీకరణ పూర్తిచేశాం. మణిశర్మ చక్కటి స్వరాల్ని అందించారు. కొత్తవాడైనా శరణ్కుమార్ మంచి నటనను కనబరిచాడు’ అని చెప్పారు. వినూత్న కథ ద్వారా హీరోగా పరిచయం కావడం ఆనందంగా ఉందని శరణ్కుమార్ అన్నారు. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీపడలేదని, త్వరలో సినిమాను విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచమవుతున్న తన కుమారుడిని ప్రేక్షకులు ఆదరించారని శరణ్కుమార్ తండ్రి రాజ్కుమార్ కోరారు.