ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలే ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా కొందరు యూట్యూబర్స్ సినీ సెలబ్రిటీలకు సంబంధించి తప్పుడు ప్రచారాలు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఒక్కోసారి శృతి మించి చంపేస్తున్నారు కూడా. తాజాగా సీనియర్ నటి ఊర్వశీ శారద మరణించినట్టు సోషల్ మీడియాలో వార్తలు పుట్టించారు.
తన మరణవార్తలకు సంబంధించిన విషయంపై స్పందించిన శారద… దయచేసి తప్పుడు వార్తలు ప్రచారం చెయ్యొద్దని తాను క్షేమంగా ఉన్నానని తెలిపారు. ఎవరో పనికి మాలిన వాళ్లు ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసి ఉంటారని ఘాటుగా స్పందించారు. ఎవరో ఎదవ చేసిన పనికి అందరూ ఏడుస్తున్నారు.. చివరకు మగాళ్లను కూడా ఏడిపించేశాడు.
ఎవడో వెధవ అల్లరిచేసి మనశ్శాంతి లేకుండా చేసాడు. ఒకటే కాల్స్ వస్తున్నాయి. నేనే క్షేమంగా ఉన్నాను. ఎవరో తప్పుడు వార్తలు రాసి చాలా మందిని బాధపెట్టేశారు. పనీపాటా లేని వారు ఏదైనా మంచి పని చేసుకోవాలి.. ఇకనైనా పద్దతి మార్చుకోవాలి అని శారద తనపై వస్తోన్న రూమర్లను ఖండించారు శారద. గతంలో వేణు మాధవ్, షకీలా, అమిత్ షా, శ్వేతా తివారీ వంటి ప్రముఖులను బ్రతికి ఉండగానే చంపేశారు.
మూడు సార్లు జాతీయ ఉత్తమనటి అవార్డు అందుకున్న శారద.. అన్ని జనరేషన్ స్టార్స్తో నటించారు. ఎన్టీఆర్తో జతకట్టిన ఆమె తర్వాత తరం హీరోలతో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి వారికీ అక్కగా, వదినగా, తల్లిగా నటించి మెప్పించారు. ప్రస్తుతం జనరేషన్ హీరోలకు అమ్మమ్మగా, నాన్నమ్మగానూ నటించి మెప్పించారు. పదేళ్ళ వయసులోనే శారద తెరపై కనిపించి అలరించారు శారద.