నిజజీవితంలో జరిగిన ఓ వీరనారి గాధను ప్రేరణగా తీసుకొని పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం ‘శాంతల’. అశ్లేష ఠాకూర్ టైటిల్రోల్ పోషించిన ఈచిత్రానికి త్రివిక్రమ్ శేషు దర్శకుడు. ఇర్రంకి సురేశ్ నిర్మాత. ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు సమర్పకుడు.
ఈ చిత్రానికి చెందిన తొలిపాటను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విడుదల చేశారు. హళిబేడు, బేలూరు ప్రాంతాల్లో జరిగిన యథార్థగాధ ఆధారంగా రూపొందించిన సినిమా ఇదని, నవంబర్ 3న సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. విశాల్ చంద్రశేఖర్ స్వరాలందించిన ఈ చిత్రానికి కెమెరా: మాన్, నిర్మాణం: ఇండో అమెరికన్ ఆర్ట్స్.