బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం 93వ ఎపిసోడ్కి చేరుకుంది.సోమవారం రోజు దిష్టి కార్యక్రమాలు జరిగాయి. కాజల్.. సన్నీకి దిష్టి తీస్తూ హస్లో వాళ్ల దిష్టి.. ఆడియన్స్ దిష్టి.. సోషల్ మీడియా దిష్టి అందరి దిష్టి పోవాలని అని దిష్ట తీసింది. ఇక సిరి తాను కూడా తగ్గేదే లే అన్నట్టు షణ్ముఖ్కి దిష్టితీసింది. ఆమె అయితే హౌస్లో వాళ్ల దిష్టి.. బిగ్ బాస్ దిష్టి.. హౌస్లో ఉన్న వాళ్ల దిష్టి పోవాలని తు తు తు అంటూ తెగ దిష్టి తీసేసింది.
అనంతరం మానస్, సన్నీలు పింకీ ఎలిమినేషన్ గురించి ముచ్చటించుకున్నారు. పింకీ కోసం లవ్ సాంగ్ పాడినందుకు హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటుందా? అని మానస్ సన్నీని అడగ్గా.. ఫుల్ హ్యాపీగా ఉంటుందిరా అని చెప్తాడు సన్నీ. ఇక నీకోసం ఏం రాసిపెట్టిందిరా? అని సన్నీ అడగ్గా.. ‘మిస్ యు ఆల్ ది బెస్ట్ విన్నర్’ అని రాసిందని చెప్తాడు మానస్. ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా పింకీలా చూసుకునేవాళ్లు దొరకడం కష్టం. మా అందరికీ పింకీ ఫుడ్ పెట్టేది కానీ.. నీకు ఫుడ్ పెట్టడంలో చాలా ప్రేమ చూపించేదిరా అని మానస్తో అంటాడు సన్నీ.
ఇక శ్రీరామ్ – కాజల్ మధ్య కూడా పింకీ ఎలిమినేషన్పై చర్చ నడిచింది. సింపథీ ఓట్లు ప్రియాంకకి పడతాయని నేను అనుకున్నా అని కాజల్ చెబుతుంది. ఇక మానస్ అర్ధరాత్రి పూట ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటాడు. కాజల్, సన్నీలు అది గమనించి..సన్నీ అతని దగ్గరకు వచ్చి సరదాగా నవ్వించే ప్రయత్నం చేస్తుంటాడు. ప్రియాంక కోసం పాడిన లవ్ సాంగ్ను పాడుతూ మానస్ను టీజ్ చేశారు. మాది ఫ్రెండ్షిప్రా, లవ్ కాదురా అని మానస్ మొత్తుకున్నప్పటికీ వాళ్లు వినిపించుకోలేదు