బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో హౌజ్మేట్స్ మధ్య ఆసక్తికర టాస్క్లు నడుస్తున్నాయి. టికెట్ టూ ఫినాలే టాస్క్లో భాగంగా తొలి రౌండ్ ఐస్ టబ్ ఛాలెంజ్ ఇచ్చారు. ఈ ఛాలెంజ్లో గాయపడ్డ సిరి, శ్రీరామ్లు మంచానికే పరిమితం అయ్యారు. సెకండ్ టాస్క్లో భాగంగా 29 నిమిషాలు లెక్కపెట్టాల్సిన ఛాలెంజ్లో మానస్ మొదటి స్థానంలో నిలిచాడు.
షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, ప్రియాంక, కాజల్, సన్నీ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మానస్ సాయం చేసినా సన్నీ ఓడిపోవడంతో హౌస్మేట్స్ అతడిపై కౌంటర్లు వేశారు. మరోపక్క సిరి..షణ్ముఖ్ హగ్ కోసం పరితపించి పోతుంది. కెమెరాలు ఉన్నాయని షణ్ముఖ్ భయపడుతుండగా, మా అమ్మ అర్ధం చేసుకుంటుందిలే అని సిరి అంటుంది. పింకీ తనకు ఓ హగ్ ఇవ్వమని అడగగా, షణ్ముఖ్ పట్టించుకోనట్టు వెళతాడు.
ఇక మూడో దశలో హౌస్లో ఉన్న ఏడుగురు కంటెస్టెంట్లు పోటీ పడ్డారు. అయితే సిరి, శ్రీరామ్లు గాయాల పాలు కావడంతో వాళ్ల తరుపున మరో ఇద్దరు గేమ్ ఆడే అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. అయితే శ్రీరామ్ తరుపున సన్నీ ఆడటానికి ముందుకు రాగా.. సిరి తరుపున ఆడటానికి ముందుకు వచ్చాడు షణ్ముఖ్. అయితే అప్పటివరకూ కాళ్ల నొప్పులు అంటూ మంచానికి పరిమితమైన సిరి టాస్క్ అనే సరికి ఆడతానని ముందుకు వచ్చింది. బిగ్ బాస్ అనుమతి ఇవ్వకపోవడంతో ఆమె స్థానంలో షణ్ముఖ్ ఆడాడు.