‘అర్జున్రెడ్డి’ చిత్రం ద్వారా తెలుగులో అరంగేట్రం చేసింది షాలిని పాండే. అందం, అమాయకత్వం కలబోసిన ప్రీతి పాత్రలో ఆమె అభినయానికి యువతరం ముగ్ధులయ్యారు. టాలీవుడ్లో ఘనమైన ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత ఆశించిన అవకాశాలు, విజయాలు దక్కలేదు. ప్రస్తుతం ఈ భామ హిందీ చిత్రసీమలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నది. ఈ సందర్భంగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్సింగ్’లో తాను నాయికగా నటించలేకపోవడానికి కారణాల్ని వివరించింది.
ఆమె మాట్లాడుతూ ‘తెలుగులో నేను పోషించిన ప్రీతి పాత్ర అందరికి గుర్తుండిపోయింది. రీమేక్ గురించి నన్నెవరూ సంప్రదించలేదు. ఒకవేళ ఆఫర్ వచ్చినా తిరస్కరించేదాన్ని కావొచ్చు. ఎందుకంటే స్వతహాగా నాకు రీమేక్స్లో నటించడం ఇష్టం ఉండదు. ఒకే పాత్రను భిన్న భాషల్లో చేయడం వల్ల పాత్రపరంగా వైవిధ్యాన్ని ప్రదర్శించే అవకాశం దొరకదు. అయితే ‘కబీర్సింగ్’లో షాహిద్కపూర్, కియారా అద్వాణీల మధ్య కెమిస్ట్రీ మాత్రం అద్భుతంగా అనిపించింది’ అని చెప్పుకొచ్చింది. గత ఏడాది ‘జయేష్బాయ్ జోర్దార్’ చిత్రంతో హిందీలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ప్రస్తుతం వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉంది.