స్టార్ డైరెక్టర్ మణిరత్నం (Mani Ratnam) చాలా కాలంగా తన డ్రీమ్ ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్ (Ponniyin Selvan)పై పనిచేస్తున్న విషయం తెలిసిందే. రెండు పార్టులుగా రాబోతున్న ఈ చిత్రంలో స్టార్ యాక్టర్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ క్రేజీ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. అజిత్ సతీమణి షాలిని (Shalini)ఈ చిత్రంలో కీ రోల్ పోషిస్తుందన్న అప్ డేట్ మరోసారి కోలీవుడ్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
ఈ క్రేజీ న్యూస్పై అఫీషియల్ అప్డేట్ ఏమీ లేకున్నా ప్రస్తుతానికి ఈ అప్డేట్ను అజిత్ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే మరోవైపు అజిత్ సన్నిహితులు మాత్రం ఇదంతా వట్టి పుకారు మాత్రమేనని కొట్టిపారేస్తున్నారు. పొన్నియన్ సెల్వన్లో ఐశ్వర్యా రాయ్, కార్తీ, జయం రవి, అరవింద్ స్వామి, త్రిష, జయరామ్, విక్రమ్ ప్రభు, శోభితా ధూళిపాళ లీడ్ రోల్స్ చేస్తున్నారు. మాధవన్తో కలిసి సఖి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది షాలిని.
Read Also : Kamal Haasan | లాభాలతో కమల్ హాసన్ ఏం చేయబోతున్నాడో తెలుసా..?
Read Also : Brahmastra | షారుక్, నాగార్జున కనిపించేది ఈ పాత్రల్లోనేనట..!
Read Also : Vijay Sam | లిటిల్ ఖుషీతో విజయ్-సమంత..ట్రెండింగ్లో స్టిల్