లాక్డౌన్ విరామంలో కథానాయికలందరూ ఇంటికే పరిమితమయ్యారు. అగ్రహీరోయిన్ సమంత మాత్రం సొంత బ్రాండ్ సాకీ వ్యవహారాలతో పాటు కుటుంబ బాధ్యతలు, ‘ఫ్యామిలీమ్యాన్-2’ ప్రమోషన్స్తో బిజీగా గడిపింది. తాజాగా ‘శాకుంతలం’ సినిమా షూటింగ్ను మొదలుపెట్టింది సమంత. ఆమె టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మహాభారతంలోని శకుంతల, దుష్యంతుల ప్రణయగాథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన ఈ సినిమా చిత్రీకరణను గత నెలాఖరున ప్రారంభించారు. ఇటీవల సమంత చిత్రీకరణలో భాగమైంది. ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్స్లో సమంత, హీరో దేవ్మోహన్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. శరవేగంగా ఈ షెడ్యూల్ను తెరకెక్కిస్తున్నట్లు చిత్రబృందం ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. పాన్ ఇండియన్ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నీలిమ గుణ నిర్మిస్తున్నారు. దిల్రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.