సమంత కథానాయికగా నటిస్తున్న పౌరాణిక ప్రణయగాథ ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకుడు. మహాభారతంలోని శకుంతల-దుష్యంతుడి అజరామరమైన ప్రేమకథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. దుష్యంతుడిగా దేవ్మోహన్ నటించారు.
ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నవంబర్ 4న భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నట్లు గతంలో ప్రకటించారు. తాజాగా ఈ చిత్రాన్ని త్రీడీ హంగులతో తీర్చిదిద్దుతున్నారు. అందుకు కొంత సమయం తీసుకుంటుంది కాబట్టి..త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని దర్శకుడు గుణశేఖర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ‘ప్రేక్షకులకు అద్భుతమైన వీక్షణానుభూతిని అందించాలన్నదే మా లక్ష్యం. సినిమా తాలూకు జ్ఞాపకాల్ని వారు చిరకాలం భద్రపరచుకోవాలనే ఆలోచనతో త్రీడీలో అందించే ప్రయత్నం చేస్తున్నాం’ అని చెప్పారు. మోహన్బాబు, సచిన్ ఖేడేకర్, కబీర్ బేడీ, ప్రకాష్రాజ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గుణ టీమ్ వర్క్స్ పతాకాలపై నీలిమ గుణ తెరకెక్కిస్తున్నారు.