షారుఖ్ఖాన్ నటించిన ‘పఠాన్’ సినిమాలో సల్మాన్ఖాన్ అతిథి పాత్రలో మెరిశారు. ఇద్దరు సూపర్స్టార్స్ తెరపై సందడి చేయడం అభిమానుల్లో జోష్ను నింపింది. అదే మ్యాజిక్ మరోసారి రిపీట్ కానుంది. సల్మాన్ఖాన్ నటిస్తున్న ‘టైగర్-3’ చిత్రంలో షారుఖ్ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సెట్లో షారుఖ్ఖాన్ అడుగుపెట్టారు.
ప్రస్తుతం ఇద్దరు హీరోలపై యాక్షన్ సీక్వెన్స్ను తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం మద్ అనే ద్వీపంలో 35 కోట్లతో భారీ సెట్ను వేశారు. ‘ఈ యాక్షన్ ఘట్టాలు సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తాయి. సెక్యూరిటీ కారణాల రీత్యా ఐలాండ్లో షూటింగ్ జరుపుతున్నాం’ అని చిత్రబృందం పేర్కొంది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్లో భాగంగా ‘టైగర్-3’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకురానుంది.