బాలీవుడ్లో సక్సెస్ఫుల్ సిరీస్గా టైగర్ సినిమాలు పేరు తెచ్చుకున్నాయి. ఈ చిత్రంలో రా (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) ఏజెంట్ టైగర్ చేసే సాహసాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సిరీస్లో మూడో సినిమా ‘టైగర్ 3’ రూపొందుతున్నది. ఈ చిత్రానికి మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఆదిత్య చోప్రా నిర్మాత.
‘పఠాన్’ పాత్రలో షారుఖ్ ఈ చిత్రంలో అతిథిగా కనిపించనుండటం విశేషం. కథలో సరైన సమయంలో ఈ క్యారెక్టర్ తెరపై మెరవడం ప్రేక్షకులను థ్రిల్ చేసింది. ఇక ఈ చిత్రంలోనూ యాక్షన్ ప్రధానంగా ఆకట్టుకోనుందని తెలుస్తున్నది. నీటిలో, సొరంగంలో, యుద్ధభూమిలో టైగర్ అదిరే యాక్షన్ చేశాడని ఈ సినిమా వర్కింగ్ స్టిల్స్ ద్వారా వెల్లడవుతున్నది.