ముంబై : బాక్సాఫీస్ వద్ద పఠాన్ వసూళ్ల సునామీ కొనసాగుతోంది. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్కు గ్రేట్ కంబ్యాక్ ఫిల్మ్గా నిలిచిన పఠాన్ కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే ఉంది. విడుదలైన 18 రోజుల తర్వాత కూడా ఈ మూవీ మెరుగైన ఆక్యుపెన్సీతో డ్రీం రన్ను కొనసాగిస్తోంది. ఆదివార నాటికి పఠాన్ రూ. 950 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి రూ. 1000 కోట్ల గ్రాస్ మార్క్ దిశగా దూసుకెళుతుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.
త్వరలోనే పఠాన్ వేయి కోట్ల క్లబ్లో చేరుతుందని విశ్లేషకులు లెక్కలు కడుతున్నారు. ఈ వీకెండ్ తర్వాత మంగళవారం వాలెంటైన్స్ డే కావడంతో వసూళ్లు మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. వచ్చే శుక్రవారం కార్తీక్ ఆర్యన్ షెహజద, మార్వెల్ యాంట్మన్ అండ్ ద వప్ క్వాంటుమనియ వంటి రెండు కొత్త రిలీజ్లు ఉండటంతో పఠాన్ దూకుడుకు కొంత బ్రేక్ పడవచ్చు. పఠాన్ 17 రోజులకు ప్రపంచవ్యాప్తంగా రూ. 901 కోట్లు కలెక్ట్ చేసి హయ్యస్ట్ హిందీ గ్రాసర్గా నిలిచిందని చిత్ర నిర్మాణ సంస్ధ యష్రాజ్ ఫిల్మ్స్ ట్వీట్ చేసింది.
ఇక మల్టీప్లెక్స్లోనూ పఠాన్ వసూళ్లు పలు రికార్డులను చెరిపేస్తున్నాయి. పఠాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 8000 స్క్రీన్స్లో విడుదలవగా భారత్లో రూ. 460 కోట్ల కలెక్షన్లు రాబట్టిన మూవీ రూ. 500 కోట్ల క్లబ్లో చేరే దిశగా దూసుకెళుతోంది. సిద్ధార్ధ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ మూవీలో కింగ్ ఖాన్ సరసన దీపిక పడుకునే ఐఎస్ఐ ఏజెంట్గా కనిపించగా రా ఏజెంట్గా జాన్ అబ్రహం నటించారు.