తమదైన శైలి చిత్రాలతో, అభినయంతో బాలీవుడ్లో దశాబ్దాల కెరీర్ నిర్మించుకున్నారు బిగ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్. కెరీర్ ప్రారంభంలో ‘కరణ్ అర్జున్’, ‘హమ్ తుమ్హారే సనమ్’ వంటి చిత్రాల్లో కలిసి నటించారు. ఆ సినిమాలు అటు అభిమానులను, ఇటు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
రెండు దశాబ్దాల తర్వాత వీళ్లిద్దరు కలిసి ఓ చిత్రంలో నటించబోతున్నట్లు తెలుస్తున్నది. ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్లో ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. ఈ చిత్రం గురించి ఇప్పటిదాకా అధికారిక సమాచారం వెలువడకున్నా, సన్నాహాల్లో ఈ భారీ ప్రాజెక్ట్ ఉందట. ఇది భారతీయ చిత్ర పరిశ్రమలో హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ కానుంది. ఈ ప్రాజెక్ట్ గురించి గతంలో షారుఖ్ స్పందిస్తూ…‘మా ఇద్దరి ఇమేజ్ వేరు. మా తరహా చిత్రాలు వేరు. ఏ దర్శకుడైనా మమ్మల్ని ఓ సినిమాలో చూపించగలిగే కథతో వస్తే నటించడానికి అభ్యంతరం లేదు’ అని చెప్పారు.