Shah Rukh Khan – Sukumar | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మరోసారి సౌత్ దర్శకుడితో చేతులు కలపబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. పుష్ప ది రూల్ సినిమాతో నేషన్ వైడ్ బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు సుకుమార్ (Sukumar)తో కలిసి షారుఖ్ తన తదుపరి ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు చాలా రోజులుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ కాంబో మళ్లీ తెరపైకి రాగా.. ఈ ప్రాజెక్ట్ను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మించబోతుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.200 నుంచి రూ.300 కోట్లు ఉండబోతుందని సమాచారం. అలాగే ఈ సినిమాకు షారుఖ్తో పాటు సుకుమార్ భారీ పారితోషికం ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
అయితే, ఇప్పటివరకు ఈ మెగా ప్రాజెక్ట్పై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. షారుఖ్ ఖాన్ ప్రస్తుతం తన ‘కింగ్’, ‘పఠాన్ 2’ వంటి ప్రాజెక్ట్లతో బిజీగా ఉన్నారు. సుకుమార్ కూడా ప్రస్తుతం తన తర్వాతి ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నట్లు సమాచారం.