బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో షారుక్ ఖాన్ (Shah Rukh Khan) ఇటీవలే ఎవరూ ఊహించని విధంగా ఇటీవలే ‘పీకే’ మూవీ డైరెక్టర్తో కొత్త సినిమా ప్రకటించి..అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే. డుంకీ (Dunki) టైటిల్తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టులో ఢిల్లీ భామ తాప్సీ పన్ను ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. తాజాగా కొత్త స్టిల్ ఒకటి షేర్ చేసి అభిమానుల్లో జోష్ నింపాడు. సినిమా సెట్స్ లో జాయిన్ అయ్యాడు షారుక్ ఖాన్.
డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ (Rajkumar Hirani), ఇతర టీం మెంబర్స్ తో సెట్స్ లో దిగిన స్టిల్ ఇపుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. రాజ్కుమార్ హిరానీ ఫిలిమ్స్, రెడ్ ఛిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్, జియో స్టూడియోలు సంయుక్తంగాడుంకీ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 2023 డిసెంబర్ 22న గ్రాండ్ థియేటరల్లో విడుదల కానుంది. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పఠాన్ చిత్రంలో నటిస్తున్నాడు షారుక్. జీరో సినిమా బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే.
మళ్లీ మూడేళ్ల విరామం తర్వాత పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు బాలీవుడ్ బాద్ షా. ఈ సినిమా రిలీజ్ కాకముందే మరో ప్రాజెక్టు ప్రకటించడం ఇపుడు హాట్ టాపిక్గా మారింది.