Actress kajol | రెండున్నర దశాబ్దాల క్రితం దిల్వాలే దుల్హానియా లే జాయేంగే అనే సినిమా ఇండియాలో నెలకొల్పిన రికార్డులు అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఇండియాలోని ది బెస్ట్ లవ్స్టోరీ సినిమాల లిస్ట్ తీస్తే అందులో ఈ మూవీ పేరు మొదటి స్థానంలో ఉంటుంది. అంతలా జనాలకు ఈ సినిమా ఎక్కేసింది. ఒక ఉత్తరాది సినిమాకు దక్షిణాది ప్రేక్షకులు గంటల కొద్ది లైన్లో నిలబడి టిక్కెట్లు తీసుకోవడం బహుశా ఈ సినిమాకే చెల్లింది. సౌత్లోనూ ఈ సినిమా అప్పట్లో రికార్డులు కొల్లగొట్టింది. ముఖ్యంగా షారుఖ్-కాజల్ జోడీకైతే వంద మార్కులు పడ్డాయి. నిజమైన ప్రేమికులు కూడా అలా ఉండరేమో అనే లెవల్లో వీళ్ల పర్ఫార్మెన్స్ ఉంటుంది.
హిందీలో ఇప్పటికీ బెస్ట్ జోడీ ఎవరంటే టక్కున వీళ్ల పేరే చెప్తారు. అంతలా ఈ జోడి ప్రేక్షకులను కనువిందు చేసింది. ఆ తర్వాత వీళ్ల కాంబినేషన్లో వచ్చిన కుచ్ కుచ్ హోతా హే, కబీ ఖుషీ కబీ ఘమ్ సినిమాలు సైతం బంపర్ హిట్లు సాధించాయి. ఇప్పటికీ షారుఖ్-కాజోల్ చాలా సన్నిహితంగా ఉంటుంటారు. ఇదే విషయాన్ని తాజాగా కాజోల్ ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చింది. షారుఖ్ ఖాన్ తనకు మంచి స్నేహితుడని, మళ్లీ ఆయనతో కలిసి ఓ రొమాంటిక్ సాంగ్ చేయాలనుందని చెప్పింది. ఆ తర్వాత ఇదే ఇంటర్వూలో.. ఇప్పటికిప్పుడు షారుఖ్ మీకు ఎదురైతే, ఆయన్ని మీరేమడుగుతారు అనే ప్రశ్న ఎదురైంది. దానికి కాజోల్.. పఠాన్ నిజమైన కలెక్షన్స్ ఎంతో చెప్పమని అడుగుతానని సరదాగా చెప్పింది.
దానికి షారుఖ్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. పఠాన్ కలెక్షన్ల గురించి అలా అనడం కరెక్ట్ కాదని అమెపై మండిపడుతున్నారు. వెయ్యి కోట్లు వచ్చిన మాట నిజం కాదా? అబద్దం చెప్పాల్సిన అవసరం షారుఖ్కు ఏముందని ట్రోల్స్ చేస్తున్నారు. సరదాగా అన్న వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ నాట సెన్సేషన్ అవుతుంది. దీనిపై మరికొందరు సరదాగా కాజోల్ చేసిన వ్యాఖ్యలకు అంతలా రియాక్ట్ కావడం కరెక్ట్ కాదని అంటున్నారు. మరీ ఈ వివాదం ఎక్కడివరకు దారి తీస్తుందో చూడాలి.