యష్రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్లో భాగంగా బాలీవుడ్ అగ్ర హీరోలు సల్మాన్ఖాన్, షారుఖ్ఖాన్ కలిసి ‘టైగర్ వర్సెస్ పఠాన్’ చిత్రంలో నటించబోతున్న విషయం తెలిసిందే. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఆదిత్యచోప్రా నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది పట్టాలెక్కనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ సినిమాకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ను త్వరలో సల్మాన్, షారుఖ్లకు వినిపించబోతున్నారట నిర్మాత ఆదిత్య చోప్రా.
యష్రాజ్ స్టూడియోలో దర్శకుడితో కలిసి స్క్రిప్ట్ నరేషన్ ఉంటుందని, తమ పాత్రల విషయంలో ఇద్దరు సూపర్స్టార్స్ మధ్య ఎలాంటి ఇగో ఇష్యూష్ రాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆదిత్యచోప్రా చెప్పారు. ఆయన మాట్లాడుతూ ‘ఇండియాలోనే బిగెస్ట్ యాక్షన్ ఫిల్మ్ ఇది. సినిమా సెట్స్మీదకు వెళ్లాక ఇద్దరు హీరోల మధ్య ఎలాంటి మనస్పర్థలు రాకుండా పక్కాగా స్క్రిప్ట్ను సిద్ధం చేస్తున్నాం. ఏమైనా అభ్యంతరాలుంటే అక్కడ పరిష్కారం కావాలి. ఈ కథ విషయంలో గోప్యత పాటిస్తున్నాం. అందుకే ఇద్దరు హీరోలు తప్ప నరేషన్ సమయంలో ఎవరూ ఉండకూడదని చెప్పాం’ అన్నారు ఆదిత్యచోప్రా. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది.