Actor Naresh | సీనియర్ నటుడు నరేష్ తన కొత్త సినిమా ‘మళ్లీ పెళ్లి’ కోసం కాస్త గట్టిగానే ప్రమోషన్లు చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా ప్రేక్షకుల్లో అటెన్షన్ క్రియేట్ చేసేందుకు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నాడు. ఇక నరేష్ ఆస్తి పాస్తుల గురించి తరచుగా చర్చలు జరుగుతూనే ఉంటాయి. నరేష్ ఆస్తి వెయ్యి కోట్లకు పైగానే ఉందని, తల్లి విజయ నిర్మల నరేష్ కోసం బాగానే ఆస్తులు కూడబెట్టిందని గతంలో ఎన్నో సార్లు విన్నాం. అంతేకాకుండా నరేష్ కూడా ఒకప్పుడు హీరోగా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఫుల్ ఫామ్లో ఉండేవాడు. పారితోషికం కూడా స్టార్ హీరోల రేంజ్లో ఉండేది. కాగా తన ఆస్తులు గురించి ఎప్పుడు చర్చించని నరేష్ తాజాగా మళ్లీ పెళ్లి ప్రమోషన్లలో ఆస్తికి సంబంధించిన విషయాలను వెల్లడించాడు.
నరేష్ తాజాగా ఓ ఇంటర్వూలో ఆర్థిక విషయాల గురించి ఓపెన్ అయ్యాడు. నేను రిచ్ అనడంలో సందేహమే లేదు. నేను బిలియనీర్ అని ఒప్పుకుంటా. మా అమ్మగారి నుంచి నాకు ఆస్తులు వచ్చాయి. నేను కూడా కష్టపడి చాలానే సంపాదించా. మేం భూముల మీద పెట్టుబడులు పెట్టాం. వాటి ధరలు బాగా పెరిగాయి. ఐతే ఎంత డబ్బు ఉంది అన్న దాన్ని బట్టి మనం ఎంత ధనవంతులం అనేది ఆధారపడి ఉండదు. ఎంత సంతోషంగా ఉన్నాం అన్నదే ముఖ్యం. రోజూ ఎంత ఆనందంగా గడుపుతాం. ఉన్న డబ్బులు ఖర్చు పెడతాం. మాకు వీలైనంత మేర పది మందికి సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక ఆయన పవిత్రతో కలిసి నటించిన మళ్లీ పెళ్లి సినిమా జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో పవిత్రతో కలిసి పెద్ద ఎత్తున ప్రమోషన్లు చేస్తున్నారు. ఎమ్.ఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాపై మంచి హైపే క్రియేట్ అయింది. పైగా టీజర్, ట్రైలర్లలో కూడా ఇది తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన స్టోరీ అని క్లారిటీ వచ్చేసింది.