రణధీర్, నందిని జంటగా నటిస్తున్న చిత్రం ‘సీతారామపురంలో ఒక ప్రేమజంట’. ఎం.వినయ్బాబు దర్శకుడు. బీసు చందర్గౌడ్ నిర్మించారు. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘వినూత్నమైన ప్రేమకథా చిత్రమిది. హృదయాన్ని కదిలించే భావోద్వేగాలుంటాయి. టీజర్, పాటలకు మంచి స్పందన లభిస్తున్నది. తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’ అన్నారు. ‘గ్రామీణ నేపథ్యంలో నడిచే ప్రేమకథ ఇది. విలేజ్ బ్యాక్డ్రాప్లో ఇప్పటివరకు ఎన్నో లవ్స్టోరీస్ వచ్చాయి. కానీ ఈ సినిమా వాటికి పూర్తి భిన్నంగా ఉంటుంది’ అని నిర్మాత చెప్పారు. ప్రేమలోని కొత్తకోణాన్ని పరిచయం చేస్తూ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందని హీరో రణధీర్ పేర్కొన్నారు. కొత్తదనం కలబోసిన ప్రేమకథలో నటించడం ఆనందంగా ఉందని కథానాయిక నందిని తెలిపింది.