శర్వానంద్ ‘రన్ రజా రన్’లో తళుక్కున మెరిసిన తార సీరత్ కపూర్. ఆ తర్వాత కూడా తెలుగులో కొన్ని సినిమాలు చేసింది తను. రీసెంట్గా అల్లు అర్జున్తో ఈ అమ్మడు దిగిన ఫొటో నెట్టింగ్ వైరల్ అయ్యింది. దాంతో సీరత్ త్వరలో బన్నీతో నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్టే ‘పుష్ప2’లో సీరత్ ఓ ఐటమ్ సాంగ్లో నర్తించనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ వార్తకు బలాన్నిస్తూ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో బన్నీ గురించి ఆసక్తికర వ్యాఖ్యాలు చేసింది సీరత్. ‘లైఫ్లో మనకు చాలామంది తారసపడుతుంటారు. వాళ్లల్లో కొందరి లక్షణాలు మనల్ని ఆకర్షిస్తుంటాయి. అలా నన్ను ఆకర్షించిన వ్యక్తి బన్నీ. తనలో ఓ స్పార్క్ ఉంటుంది. అది ఎవరినైనా కట్టిపడేస్తుంది. బన్నీ గురించి వ్యక్తిగతంగా తెలుసుకునే అవకాశం కొందరికే వస్తుంది. ఆ కొందరిలో నేనూ ఉన్నాను. స్టార్ అయివుండి కూడా ఎంతో వినయంగా ఉంటాడు. అతనితో ఉన్నవాళ్లను సొంత మనుషుల్లా చూసుకుంటాడు. తనతో కలిసి పనిచేసే రోజుకోసం ఎదురుచూస్తున్నాను’ అంటూ మనసుని ఆవిష్కరించింది సీరత్.