మహేష్బాబు కథానాయకుడిగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రంలోని తొలిగీతం ‘కళావతి..’ మెలోడీ ప్రధానంగా సంగీతప్రియుల్ని విశేషంగా అలరిస్తున్నది. సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్లో ఉంది. ఈ సినిమా నుంచి మరో గీతం ‘పెన్నీ..’ ఈ నెల 20న విడుదలకాబోతున్నది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం గురువారం కొత్త పోస్టర్ను విడుదల చేసింది. ఇందులో మహేష్బాబు డాషింగ్లుక్లో కనిపిస్తున్నారు. బ్యాంకులను మోసం చేసే బడాబాబులు, రైతు సమస్యల నేపథ్యంలో కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకొంటున్నదని చిత్రబృందం పేర్కొంది. పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్నది. తమన్ స్వరకర్త. వేసవి కానుకగా మే 12న ప్రేక్షకుల ముందుకురానుంది. వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్. మది, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, నిర్మాణ సంస్థలు: మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్, రచన-దర్శకత్వం: పరశురాం.