చిరంజీవి నటిస్తున్న 157వ సినిమా తాజా షెడ్యూల్ బుధవారం ముస్సోరీలో మొదలైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నయనతార కథానాయిక. ఇప్పటికే హైదరాబాద్లో ఓ షెడ్యూల్ పూర్తయింది.
బ్యూటీఫుల్ హిల్స్టేషన్ ముస్సోరీలో మొదలైన తాజా షెడ్యూల్ పదిరోజుల పాటు జరుగుతుందని.. చిరంజీవి, నయనతారతో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటున్నారని, కొన్ని కీలకమైన వినోదాత్మక సన్నివేశాలను తెరకెక్కించబోతున్నామని మేకర్స్ తెలిపారు.
నాన్స్టాప్ కామెడీ ఎంటర్టైనర్గా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారని, ఇందులో మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ కామెడీ టైమింగ్ను మరోసారి చూస్తారని, అభిమానులకు నవ్వుల విందులా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, నిర్మాతలు: సాహు గారపాటి, సుస్మిత కొణిదెల, రచన-దర్శకత్వం: అనిల్ రావిపూడి.