సూర్య శ్రీనివాస్, షెర్రీ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘ఎంతవారు గాని’. ఎన్.శ్రీనివాసన్ దర్శకుడు. రాజశేఖర్ అన్నభీమోజు, సురేంద్ర కారుమంచి, శివ ముప్పరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ను ఇటీవల హీరో అడివి శేష్ విడుదల చేశారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘యూత్ ఆడియన్స్ను అలరించే అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. వైవిధ్యమైన కథతో పాటు చిత్రంలో ఆశ్చర్యపరిచే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎన్నో ఉన్నాయి’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ కూరాకుల.