సాయిధన్సిక, తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, కేవీ ధీరజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘షికారు’. హరికొలగాని దర్శకత్వంలో పీఎస్ఆర్ కుమార్ నిర్మించారు. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘నెల్లూరులోని నారాయణ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులకు ఈ సినిమా చూపించాం. వారు అద్భుతమైన స్పందన కనబరిచారు. శేఖర్చంద్ర సంగీతం, భాస్కరభట్ల సాహిత్యం చక్కగా కుదిరాయి.
యువతతో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలున్న చిత్రమిది’ అన్నారు. ‘యువతరం మనోభావాలకు దర్పణంలా ఉంటుందీ చిత్రం. ఎక్కడా అశ్లీలతకు తావులేకుండా తెరకెక్కించాం’ అని నిర్మాత చెప్పారు. నలుగురు కుర్రాళ్ల కథ ఇదని, దర్శకుడు తాను చూసిన అనుభవాలతో ఈ కథ సిద్ధం చేశారని మాటల రచయిత విశ్వకరణ్ తెలిపారు. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం కావడం ఆనందంగా ఉందని కథానాయిక సాయిధన్సిక చెప్పింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.