సత్యదేవ్, తమన్నా జంటగా నటించిన సినిమా ‘గుర్తుందా శీతాకాలం’. చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ నెల 9న ఈ సినిమా ప్రేక్షకుల మందుకు రానుంది. నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ…‘సృష్టికి మూల కారణం మనుషుల మధ్య ఉన్న ప్రేమే. ఆ ప్రేమ లేకుంటే ప్రపంచమే లేదు అనే కాన్సెప్ట్ను మా చిత్రంలో ఆకట్టుకునేలా చూపిస్తున్నాం.
ఆహ్లాదకర ప్రేమ కథగా ఈ సినిమా గుర్తుండిపోతుంది. సినిమా చూశాక ఇందులోని ఏ పాత్రనూ మర్చిపోలేరు. సత్యదేవ్, తమన్నా క్యారెక్టర్స్ ఆకర్షణగా నిలుస్తాయి. లవ్స్టోరికి సంగీతం చాలా ముఖ్యం. ఇప్పటికే మా పాటలకు మంచి ఆదరణ దక్కుతున్నది. ఈ సినిమాలో మూడు విభిన్న ప్రేమ కథలు ఉంటాయి’ అన్నారు.