‘రక్తకన్నీరు’ నాగభూషణం మనవడు, దర్శకుడు మీర్ తనయుడు అబీద్ భూషణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘శాసనసభ’. ఈ పాన్ ఇండియా చిత్రంలో ఇంద్రసేన కథానాయకుడు. భూషణ్ ఈ చిత్రంలో ఓ కీలకపాత్రలో కనిపించబోతున్నాడు. ఈ నెల 16న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా భూషణ్ మాట్లాడుతూ ‘ పొలిటికల్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఓ ప్రముఖ రాజకీయ నాయకుడిని పోలిన పాత్రలో కనిపించబోతున్నాను. ఆయన ఇన్స్పిరేషన్తో ‘శాసనసభ’లో నేను ఈ గొప్ప పాత్రను పోషించాను.
ఎన్నికల సమయంలో ఆయన ప్రజలతో కలిసిపోయిన విధానం, ఆయనలోని లీడర్షిప్ క్వాలిటీస్ నా పాత్రకు ప్రేరణ ఇచ్చాయి. తప్పకుండా ఈ చిత్రం నాకు నటుడిగా మంచి పేరును తెస్తుందనే నమ్మకం వుంది. దీంతో పాటు నేను ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘్రైస్టెకర్’ అనే చిత్రం రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తిచేసుకుంది. మరికొన్ని చిత్రాలు చర్చల దశలో వున్నాయి’ అని తెలిపారు.