టాలీవుడ్ (Tollywood) సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata)ను షూటింగ్ను పూర్తి చేసే పనిపై ఫోకస్ పెట్టాడు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఫైనల్గా మిగిలిన ఓ పాటను కంప్లీట్ చేసే పనిలో ఉంది మహేశ్ అండ్ టీం. పరశురాం (Parasuram)డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రంపై ఓ క్రేజీ అప్ డేట్ వచ్చేసింది. ప్రస్తుతం సర్కారు వారి పాట చివరి పాటను చిత్రీకరిస్తున్నారని ఫిలింనగర్ సర్కిల్ టాక్. ఈ పాటను రామోజీ ఫిలింసిటీలో షూట్ చేస్తుందట పరశురాం అండ్ మహేశ్ టీం.
మాస్ నంబర్గా రాబోతున్న ఈ సాంగ్ షూట్ మరో రెండు రోజులు జరుగనున్నట్టు ఇన్సైడ్ టాక్. తాజా షెడ్యూల్తో సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తయినట్టే. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా ఈ చిత్రం విడుదల వాయిదా పడనున్నట్టు వార్తలు వస్తుండగా..మరోవైపు మేకర్స్ మాత్రం ముందుకు ప్రకటించిన మే 12న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే పనిలో ఉన్నారని సమాచారం.
సర్కారు వారి పాటను మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కోలీవుడ్ భామ కీర్తిసురేశ్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే విడుదలైన కళావతి సాంగ్కు అద్బుతమైన స్పందన రావడమే..నెట్టింట రికార్డు స్థాయిలో వ్యూస్ పంట పండిస్తోంది.