చివరిగా సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ప్రేక్షకులని పలకరించిన మహేష్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఓ షెడ్యూల్ని దుబాయ్లో ముగించుకొని, రెండో షెడ్యూల్ని హైదరాబాద్లో జరిపించేందుకు ప్లాన్ వేసింది. అయితే ఇంతలో కరోనా సెకండ్ వేవ్ మొదలు కావడంతో షూటింగ్ ఆపేశారు. మే 31న కృష్ణ బర్త్డే సందర్భంగా చిత్రం నుండి అప్డేట్ వస్తుందనుకున్న ఫ్యాన్స్కి నిరాశే ఎదురైంది.
కరోనా కష్టకాలంలో మూవీ నుండి ఎలాంటి ప్రచార చిత్రాలు విడుదల చేయాలనుకోలేదు అని మేకర్స్ తెలియజేశారు. అయితే సాలిడ్ అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మహేష్ ఫ్యాన్స్ కి మేకర్స్ ఇప్పుడు అప్డేట్ ఇచ్చారు. త్వరలో షూటింగ్ మొదలు పెట్టనుండగా, షూట్ మొదలైన దగ్గర నుండి అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం అని మేకర్స్ ప్రకటించారు. జూలై నుంచి సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది.