టాలీవుడ్ (Tollywood) స్టార్ యాక్టర్ మహేశ్ బాబు చేస్తున్న తాజా ప్రాజెక్టు సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). పరశురాం (Parasuram) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తిసురేశ్ (Keerthy Suresh) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. మే 12న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ధరలను పెంచుకునేందుకు అనుమతిచ్చింది. అదేవిధంగా 5 షోలు వేసుకునేందుకు అనుమతి కూడా ఇచ్చింది.
5వ షో వేసుకునేందుకు మే 12 నుంచి 18 వరకు అవకాశం ఇచ్చింది. వారం రోజుల పాటు మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్స్ థియేటర్లలో రూ.50 పెంచుకునేందుకు అనుమతివ్వగా..ఏసీ సాధారణ థియేటర్లో రూ.30 పెంచుకునే అవకాశం కల్పించింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ , జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నాయి.
బ్యాంకింగ్ కుంభకోణాల నేపథ్యంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. థమన్ మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన కళావతి పాట ఇప్పటికే రికార్డు స్థాయిలో వ్యూస్ కొల్లగొడుతోంది.
#SarkaruVaariPaata Nizam Ticket Hike Permission Granted 👍
Bookings Opens Soon 💣💥
Get Ready for SuperStar @urstrulyMahesh Mental Mass Swag 🤘❤️🔥#SVPMania #SVP pic.twitter.com/bfzAnwr55W
— Viswa CM (@ViswaCM1) May 9, 2022