Sarkaru Vaari Paata on OTT | మహేష్బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నాడు. దాదాపు రెండున్నరేళ్ళ తర్వాత మహేష్ వెండితెరపై కనిపించడంతో అభిమానులు సంతోషంతో ఊగిపోయారు. పరశురాం దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న భారీ అంచనాలతో విడుదలై మిక్స్డ్ రివ్యూలను తెచ్చుకుంది. కానీ కలెక్షన్లలో మాత్రం జోరు చూపించింది. మహేష్ కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా సర్కారు వారి పాట నిలిచింది. ఇక ఈ చిత్రంలో మహేష్బాబు క్యారెక్టరైజేషన్, ఎనర్జీ గత చిత్రాలకు భిన్నంగా ఉంది. అయితే తాజాగా సర్కారు వారి పాట బృందం ప్రేక్షకులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది.
తాజాగా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్లో విడుదలైంది. కానీ మేకర్స్ ఈ చిత్రాన్ని ‘పే పర్ వ్యూ’ పద్దతిలో విడుదల చేశారు. ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళు ఆ చిత్రాన్ని చూడాలంటే అదనంగా రూ.199 చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ చిత్రాన్ని ఉచితంగా చూడాలంటే మరో 10రోజులు ఆగాల్సిందే. కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సముద్రఖని ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14రీల్స్ ఎంటర్టైనమెంట్స్ సంస్థలతో కలిసి జీఎమ్బీ ఎంటర్టైనమెంట్స్ పతాకంపై మహేష్బాబు స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు.