Sarkaru Vaari Paata | దాదాపు రెండున్నరేళ్ళ తర్వాత మహేష్ ‘సర్కారు వారి పాట’ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఆకలితో ఉన్న అభిమానులకు ఈ చిత్రం ఫుల్ మీల్స్ను పెట్టింది. ఈ చిత్రంలో మహేష్బాబు క్యారెక్టరైజేషన్, ఎనర్జీ గత చిత్రాలకు భిన్నంగా ఉంది. భారీ అంచనాలతో మే 12న విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ రివ్యూలను తెచ్చుకుంది. కానీ కలెక్షన్లలో మాత్రం జోరు చూపిస్తుంది. మహేష్ కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా సర్కారు వారి పాట నిలిచింది. ఆర్ఆర్ఆర్ తర్వాత మళ్ళీ ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. లేటెస్ట్గానే ఈ చిత్రం అమెరికాలో 2మిలియన్ గ్రాస్ను క్రాస్ చేసింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం మరో అరుదైన రికార్డును క్రియేట్ చేసింది.
సర్కారువారి పాట చిత్రం టాలీవుడ్లో బెంచ్ మార్కును సెట్ చేసింది. రీజినల్ చిత్రాలలో వేగంగా రూ.100కోట్ల షేర్ను సాధించిన సినిమాగా సర్కారు వారి పాట రికార్డు క్రియేట్ చేసింది. విడుదలైన ఐదు రోజుల్లోనే ఈ స్థాయి కలెక్షన్లను సాధించంటే విశేషం అనే చెప్పాలి. ఇప్పటివరకు ఈ చిత్రం 160కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేసింది. ఇదే జోరు కొనసాగిస్తే మరో రెండు, మూడు రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ను సాధించి లాభాల్లోకి వస్తుందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సముద్రఖని ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. 14రీల్స్ ఎంటర్టైనమెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లతో కలిసి మహేష్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
#BlockbusterSVP is setting new benchmarks in TFI 🔥#SVP #SVPMania #SarkaruVaariPaata
Super🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @GMBents @14ReelsPlus @saregamasouth pic.twitter.com/g4bAenYhDI
— Mythri Movie Makers (@MythriOfficial) May 17, 2022