Sarkaru Vaari Paata | మహేష్బాబు నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్ళు దాటింది. ప్రస్తుతం ఈయన నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, గ్లింప్స్ సినిమాపై ఒక్కసారిగా భారీ అంచనాలను పెంచాయి. పరుశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మే12న విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది.
ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఒకవేళ అది కుదరకపోతే సౌత్లో తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తుంది. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలతో కలసి మాహేష్బాబు స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు.
బ్యాంకింగ్ మోసాల నేపథ్యంలో తెరకెక్కతున్న ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైనా కళావతి సాంగ్ 80 మిలియన్లకు పైగా వ్యూస్ను సాధించింది. ఈ చిత్రం గతంలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. దీంతో పాటు అడివిశేష్ హీరోగా తెరకెక్కతున్న ‘మేజర్’ సినిమాకు మహేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.